మరో వాయుగుండం దూసుకొస్తోంది.. ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌కు 'సెన్యార్' తుఫాన్ ముప్పు తప్పింది. అయితే, శ్రీలంక సమీపంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడి, ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు, ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.


ఆంధ్రప్రదేశ్‌కు సెన్యార్ తుఫాన్ ముప్పు తప్పింది. ఇండోనేషియా దగ్గర మలక్కా జలసంధి దగ్గర ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుఫాన్‌గా మారింది. దీనికి 'సెన్యార్' అని పేరు పెట్టగా.. ఈ తుఫాన్ పశ్చిమ దిశగా కదులుతూ ఇండోనేషియా తీరాన్ని తాకింది. ఇవాళ సాయంత్రం వరకు తుఫాన్ తీవ్రత కొనసాగి బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ మార్చుకుని మలేషియా వైపు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావం భారత భూభాగంపై ఉండదంటున్నారు. ఈ తుఫాన్ ఇండోనేసియాలో తీరం దాటిన తర్వాత, దాని తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ తుఫాన్ వల్ల భారత్‌కు ఎలాంటి ముప్పు లేదన్నారు.

మరోవైపు నైరుతి ప్రస్తుతం శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. ఇవాళ వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి. ఆ తర్వాత, ఈ వాయుగుండం అదే దిశలో ప్రయాణిస్తూ, శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయి అంటున్నారు. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు కూడా వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు. ప్రకాశం, అన్నమయ్య, కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం నాటికి పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి అంటున్నారు. యానాం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 

ఇవాళ తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెబుతున్నారు. శుక్రవారం, శనివారం, ఆదివారం కూడా గాలుల తీవ్రత పెరుగుతుందంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైతులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు. మరోవైపు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరోసారి పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 16 డిగ్రీల్లోపు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో చలి తీవ్రతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు.